అలాంటి పాత్రలు చెయ్యడానికి ఇష్టపడతాను.. మానుషి చిల్లర్ షాకింగ్ కామెంట్స్

మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Update: 2024-04-21 10:42 GMT

దిశ, సినిమా: మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బడే మియాన్ ఛోటే మియాన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటరవ్యూలో పాల్గొని ‘యానిమల్’ మూవీపై ప్రశంసలు కురిపించింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలని ఉంది. రీసెంట్‌గా వచ్చిన ‘యానిమల్’ చూశా. అందులో రష్మిక, త్రిప్తి డిమ్రీ ఇద్దరి పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ నాకు వాటిలో రష్మిక పాత్రలో నటించాలని ఉంది. ఎందుకంటే.. భర్త ఎలా ఉన్న ఆమె ఒక బాధ్యత గల భార్య అతని కోసం నిలబడింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగింది. అందులో రష్మిక నటన సూపర్. ఒక నటిగా.. అలాంటి సవాలు చేసే పాత్రలు నాకు వస్తే చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ మానుషి చిల్లర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More...

Samantha Ruth Prabhu : సమంత ధరించిన ఆ మెలికల వాచ్ ధర ఎంతో తెలుసా..?  

Tags:    

Similar News