ఉగ్రవాద సంస్థతో సంబంధాలు!.. వివాదంలో బాలీవుడ్ సీనియర్ నటి..

సెలబ్రెటీలు కొన్ని బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ చెయ్యడం చాలా కామన్.

Update: 2024-06-29 13:44 GMT

దిశ, సినిమా: సెలబ్రెటీలు కొన్ని బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ చెయ్యడం చాలా కామన్. కానీ కొన్ని సార్లు అవే వాళ్లకు వివాదాలను తెచ్చిపెడతాయి. ఈ క్రమంలోనే ఓ బ్రాండ్‌కు ప్రమోటర్‌గా ఉన్న కారణంగా పెద్ద వివాదంలో చిక్కుకుంది బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్. అసలు విషయం ఏంటంటే.. రెహన్ సిద్ధిఖీ అనే అమెరికన్ వ్యాపారవేత్త ఆగస్టులో తన కంపెనీకి సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నాడు. ఈ కంపెనీకి ప్రమోటర్‌గా చేస్తున్న మాధురీ దీక్షిత్ ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నట్లు తెలిసింది. అయితే.. పాకీస్తాన్ సంతతికి చెందిన రెహన్ సిద్ధిఖీకి ISIతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో.. ఆయనకు సంబంధించిన వ్యాపారాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది ప్రభుత్వం. అలాంటి వ్యక్తి కంపెనీకి సంబంధించిన ఈవెంట్‌లో ఈ నటి పాల్గొంటుంది అనే విషయం తెలియడంతో ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.

కాగా.. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను పొలిటికల్ కాలమిస్ట్ సునంద వశిష్ట్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు మాధురిపై ఫైర్ అవుతున్నారు. ‘ISI లాంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రమోటర్‌గా ఉండటం ఏంటి? ఈవెంట్‌లో పాల్గొనడం ఏంటి? తక్షణమే ఇందులో నుంచి తప్పుకో’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై మాధురీ దీక్షిత్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.




 


Similar News