ఎన్నికలు ముగిశాయి, ఇండియా గెలిచింది.. నాకు ఏదైనా పని ఉంటే చెప్పండంటూ నటుడు రిక్వెస్ట్

ఇటీవల కాలంలో చాలా మంది అవకాశాలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నారు.

Update: 2024-07-01 12:56 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది అవకాశాలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నారు. కొందరు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తే.. మరికొందరు మాత్రం ఫొటోలతో, యూట్యూబ్ వ్లాగ్స్‌తో జీవనం కొనసాగిస్తున్నారు. ఎంత స్టార్ డబ్ ఉన్నప్పటికీ డిజాస్టర్ ఎదురవడంతో అవకాశాలు రావడం కష్టంగా మారింది. పనికోసం కొందరు సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు కూడా పెడుతున్నారు.

తాజాగా, బుల్లితెర నటుడు కరన్ పటేల్ ఇన్‌స్టా వేదికగా పని చెప్పండంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ‘‘ సో ఇప్పుడు.. దేశంలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. అలాగే ఇండియా T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దీపికా పదుకొణె బేబీ బంప్‌తో కనిపించడంతో తల్లి కాబోతున్నట్లు రివీల్ అయిపోయింది. కాబట్టి తల్లిదండ్రులు కాబోతున్న జంటకు కంగ్రాట్స్ తెలుపుతున్నాను. ఇప్పుడు తిరిగి పనులు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కాస్టింగ్ అవకాశం ఉంటే ఎవరైనా నాకు చెప్పండి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం కరణ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

 


Similar News