ఆసుపత్రిలో చేరిన అజిత్ భార్య పోస్ట్ వైరల్.. ఆందోళనలో ఫ్యాన్స్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని ఆసుపత్రిలో చేరింది.

Update: 2024-07-03 12:08 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని ఆసుపత్రిలో చేరింది. కారణం ఏంటో చెప్పనప్పటికీ ఆసుపత్రి బెడ్‌పై కూర్చుని భర్తతో కలిసి దిగిన ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అలాగే ‘‘లవ్ యూ ఫరెవర్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం షాలిని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు కొందరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు ఏమైందని ఆందోళన చెందుతూ వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా, అజిత్ ప్రజెంట్ ‘విడాముయర్చి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్పుడప్పుడు అజిత్ రియల్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. రియల్ హీరో అని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే విడాముయర్చి మూవీకి సంబంధించిన పోస్టర్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.


Similar News