అశ్వినీ దత్ కూతుర్లపై ఆర్‌జీవి ట్వీట్ వైరల్.. బావులు తవ్వుకోండి అంటూ కామెంట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సినిమా ‘కల్కి 2898AD’.

Update: 2024-07-01 14:06 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సినిమా ‘కల్కి 2898AD’. దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రికార్డు కలెక్షన్లకు దగ్గరకు చేరుకోవడంతో పండుగ చేసుకుంటున్నారు చిత్రం యూనిట్.

ఇక కల్కి సక్సెస్‌పై అభిమానులతో పాటు.. సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అయితే.. ‘కల్కి’ మూవీలో ఆర్‌జీవి కూడా ఓ సీన్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అలాగే సినిమాపై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తాజాగా తన X వేదికగా మరో పోస్ట్ పెట్టాడు ఆర్‌‌జీవి. ఈ మేరకు ‘కృతజ్ఞతలు @AshwiniDuttCh అండ్ @SwapnaDuttCh. @నాగాశ్విన్7.. తండ్రీ కూతుళ్లు సేకరిస్తున్న డబ్బును భద్రపరచడానికి లోతైన బావిని తవ్వవలసి ఉంటుంది. అలాగే #Kalki2898లోని 2వ భాగం నుండి కూడా సేకరిస్తారు’ అంటూ అశ్వినీ దత్ కూతుర్లపై పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఆర్జీవి ట్వీట్ వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.


Similar News