పుల్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చేరిన స్టార్ నటుడు.. కొడుకు కామెంట్స్ వైరల్

బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శ్రతుఘ్న సిన్హా తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది.

Update: 2024-07-01 15:20 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శ్రతుఘ్న సిన్హా తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. ‘మేరే అప్నే, కాళీ చరణ్, విశ్వనాథ్, కాలా పత్థర్, దోస్తానా’ వంటి పలు మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే.. ఈయన ఆరోగ్యం పాడవటంతో ముంబై‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని తాజాగా సిన్హా కొడుకు ప్రకటిస్తూ.. ‘నాన్నకు తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాము. అలాగే అన్ని వైద్య పరీక్షలు చేయించి సాధారణం అయ్యాక ఇంటికి తీసుకెళ్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ఆసుపత్రిలో ఎప్పుడు జాయిన్ చేశారు అనేది మాత్రం చెప్పలేదు. కాగా.. శ్రతుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తాజాగా తన ప్రియుడుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రికి కూడా వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. 

Similar News