గాజులు తొడుక్కుని కూర్చోలేదు: బాలయ్య

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన బాలయ్య.. తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని, ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. రైతులను ఆదుకోకుంటే రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ.. గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటలను పరిశీలించి.. […]

Update: 2021-01-06 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన బాలయ్య.. తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని, ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. రైతులను ఆదుకోకుంటే రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ.. గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు.

Tags:    

Similar News