గల్లంతైన మత్స్యకారులు సేఫ్..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కాకినాడ తీరంలో ఇటీవల గల్లంతైన మత్స్యకారులు సురిక్షితంగా సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవుకు ఏడుగురు మత్స్యకారులను కోస్టుగార్డు సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు. ఈనెల 7న కాకినాడ తీరం నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లగా .. ఇంజిన్ ఆగిపోవడంతో తీవ్ర వాయుగుండంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో వీరు ప్రయాణిస్తున్న బోటు దారి తప్పగా.. సముద్రంలో చిక్కుకున్న వీరిని కోస్టుగార్డు సిబ్బంది గమనించారు.అనంతరం వారి నుంచి వివరాలు […]

Update: 2020-10-16 04:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కాకినాడ తీరంలో ఇటీవల గల్లంతైన మత్స్యకారులు సురిక్షితంగా సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవుకు ఏడుగురు మత్స్యకారులను కోస్టుగార్డు సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు. ఈనెల 7న కాకినాడ తీరం నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లగా .. ఇంజిన్ ఆగిపోవడంతో తీవ్ర వాయుగుండంలో చిక్కుకున్నారు.

ఆ సమయంలో వీరు ప్రయాణిస్తున్న బోటు దారి తప్పగా.. సముద్రంలో చిక్కుకున్న వీరిని కోస్టుగార్డు సిబ్బంది గమనించారు.అనంతరం వారి నుంచి వివరాలు సేకరించి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

Tags:    

Similar News