అరసవల్లిలో రెండో రోజు స్వామివారిని తాకిన సూర్యకిరణాలు

అరసవల్లిలో వరుసగా రెండో రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Update: 2024-10-02 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: అరసవల్లిలో వరుసగా రెండో రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి సూర్యకిరణ శోభతో దేద్దీప్యమానంగా వెలిగిపోతున్న స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. కాగా.. శ్రీకాకుళం (Srikakulam) పట్ణణానికి 2 కి.మీ దూరంలో ఉన్న అరసవల్లి గ్రామంలో  కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా దక్షిణాయంలో అంటే అక్టోబర్ 1, 2 తేదీల్లో.. అలాగే ఉత్తరాయణంలో అంటే మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూలవిరాట్‌ను నేరుగా తాకుతాయి. అయితే వాతావరణ సమస్యల వల్ల రెండేళ్లుగా ఈ సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించకలేకపోయాయి. దీంతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాకపోవడం భక్తులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే ఈ ఏడాది వారి ఆశలు ఫలించి సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి.


Similar News