ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. 9 గంటల లోపు జరిగిన పోలింగ్ శాతం వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల లోపు జరిగిన పోలింగ్ శాతం వివరాలు చూస్తే.. విశాఖపట్నంలో 9.5 శాతం పోలింగ్ నమోదు కాగా, అనకాపల్లి జిల్లా లో 10.25 శాతం నమోదు అయ్యింది. అలానే అల్లూరి జిల్లాలో10.00 శాతం పోలింగ్ నమోదైంది.