దారుణం...శిశువును విక్రయించిన తల్లిదండ్రులు

కన్న శిశువును తల్లిదండ్రులు విక్రయించిన సంఘటన బుధవారం వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-23 14:49 GMT

దిశ, వేములవాడ : తమ శిశువును తల్లిదండ్రులు విక్రయించిన సంఘటన బుధవారం వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. పైగా తన శిశువును అపహరించారని కొనుగోలు చేసిన వారిపై తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తిరిగి శిశువును కన్నతల్లికి అప్పగించారు. పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడకు చెందిన బత్తుల శ్యామల ఆమె భర్త రవీందర్ తమ 10 నెలల శిశువును జగిత్యాలకు చెందిన లక్ష్మికి రూ. 90 వేలకు మంగళవారం విక్రయించారు. అనంతరం ఏమైందో ఏమో కానీ లక్ష్మి అనే మహిళ తన కూతురును అపహరించిందని శ్యామల ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. జగిత్యాలలో లక్ష్మి వద్ద ఉన్న శిశువును తీసుకొచ్చి శ్యామలకు అప్పగించారు. శిశువును విక్రయించిన రవీందర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

Tags:    

Similar News