ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం

మండలంలోని వాడ గూడెం ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు

Update: 2024-10-12 06:27 GMT

దిశ, మంగపేట : మండలంలోని వాడ గూడెం ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రైవేటు వాహనంలో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి మండలంలోని బుచ్చంపేట కు చెందిన చీమల రవి(29), చీమల సమ్మయ్య(34)లు దసరా పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని కొత్తూరు లో ఉన్న వారి అక్క మద్దెల సుమ-రాజుల ఇంటికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో వాడ గూడెం లో వారి ద్విచక్ర వాహనానికి ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో రోడ్డు పక్కనే ద్విచక్ర వాహనంపై ఉన్న మండలంలోని రమణక్కపేటకు చెందిన బట్ట సతీష్ ను బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో చీమల రవి, చీమల సమ్మయ్యలు తీవ్రంగా గాయపడగా బట్ట సతీష్ కు కాలు తెగిపోయి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ రవి, సమ్మయ్యలను స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించి ఓ ప్రైవేటు వాహనంలో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పండగపూట ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.


Similar News