భారీగా దేశిదారు మద్యం పట్టివేత

కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ముత్యం రమేష్ పర్యవేక్షణలో గూడెం చెక్ పోస్ట్ వద్ధ దేశిదారు మద్యంను బుధవారం పట్టుకున్నారు.

Update: 2024-10-23 15:05 GMT

దిశ,చింతలమానేపల్లి : కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ముత్యం రమేష్ పర్యవేక్షణలో గూడెం చెక్ పోస్ట్ వద్ధ దేశిదారు మద్యంను బుధవారం పట్టు కున్నారు. చింతలమానేపల్లి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గల గూడెం చెక్ పోస్ట్ వద్ధ గూడెం గ్రామానికి చెందిన బొమ్మ సాయి కృష్ణ వద్ద రూ.7380 విలువ గల 82 దేశిదారు మద్యం సీసాలను పట్టుకున్నారు. నిందినితుడిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఇస్లావత్ నరేష్ తెలిపారు.  

Tags:    

Similar News