Himachal Pradesh Bank Robbery: బ్యాంకు దోపిడీ.. మాస్క్, బాంబుతో వచ్చి..

హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకు లూటీ జరిగింది.

Update: 2023-07-06 16:39 GMT

సికార్: హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకు లూటీ జరిగింది. హర్సావా అనే గ్రామంలో యెస్ బ్యాంకులోకి దూసుకొచ్చిన ముసుగు దొంగ తన చేతిలో బాంబు ఉందని, డబ్బులు ఇవ్వకుంటే దాన్ని పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన క్యాషియర్ రూ.1.25 లక్షలిచ్చాడు. ఆ డబ్బుతో సంతృప్తి చెందని దుండగుడు క్యాషియర్ క్యాబిన్‌లోకి వచ్చి రూ.24 లక్షలు ఉన్న క్యాష్ బ్యాగ్ తీసుకెళ్లి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ బ్యాంకు మెయిన్ గేట్‌కు బయటి నుంచి తాళం కూడా వేశాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News