Gujarat: లైంగికదాడి కేసులో యువకుడికి మరణశిక్ష

గుజరాత్‌లో రెండేళ్ల పాపపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన 23 ఏళ్ల యువకుడికి సూరత్ లోని అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.

Update: 2023-08-02 16:22 GMT

గాంధీనగర్ : గుజరాత్‌లో రెండేళ్ల పాపపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన 23 ఏళ్ల యువకుడికి సూరత్‌లోని అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. బాధిత చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని సచిన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కప్లేతా గ్రామంలో బాధిత చిన్నారి ఫ్యామిలీ ఉంటుంది. ఆ పాప తండ్రికి నిందితుడు యూసుఫ్ ఇస్మాయిల్‌ స్నేహితుడు. ఫిబ్రవరి 27న భోజనం, కూల్ డ్రింక్ ఇప్పిస్తానని ఆ పాపకు చెప్పి.. సమీపంలోని దుకాణానికి యూసుఫ్ తీసుకెళ్లాడు.

ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి కత్తితో నరికి చంపాడు. పాప మృతదేహాన్ని పొలంలో పడేసి పారిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. మరుసటి రోజే యూసుఫ్ ను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన సూరత్ లోని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి శకుంతలా సోలంకి నిందితుడు యూసుఫ్ ఇస్మాయిల్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వినిపించారు. ఐపీసీలోని 302, 376 సెక్షన్లు, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఇస్మాయిల్ ను దోషిగా నిర్థారించారు.


Similar News