బైక్ నుంచి కిందపడి వ్యక్తి దుర్మరణం

రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన దుర్గం బాపు శనివారం బైక్ నుంచి కిందపడి మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.

Update: 2024-10-19 15:49 GMT

దిశ, ఆసిఫాబాద్ : రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన దుర్గం బాపు శనివారం బైక్ నుంచి కిందపడి మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం బాపు సింగరేణి గోలేటి సీహెచ్ పీ లో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం పనినిమిత్తం బైక్ పై కాగజ్నగర్ వెళ్తున్న క్రమంలో ఇంద్రానగర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడింది. దాంతో బాపునకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో బాపు మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 

Tags:    

Similar News