బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు…ముగ్గురు మృతి

హైదరాబాద్ బీజాపూర్ హైవే 163 పై పూడూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

Update: 2024-10-17 08:59 GMT

దిశ, పరిగి : హైదరాబాద్ బీజాపూర్ హైవే 163 పై పూడూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మొన్నెగూడ వైపుకు బైక్ పై వెళ్తున్నారు. హైవే 163 పై గూడూరు గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.


Similar News