పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని నంద్యాలలో జరిగింది.

Update: 2023-06-20 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని నంద్యాలలో జరిగింది. మహానంది మండలం గోపవరం వద్ద రైలు కింద పడి చినబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే బైక్ చోరీ కేసులో నంద్యాల పోలీసులు తనను అక్రమంగా ఇరికించారని, చేయని నేరానికి తనను బాగా కొట్టారని చినబాబు అనే యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అందుకే మనస్థాపంతో చనిపోతున్నట్లు వీడియోలో తెలిపాడు. ఎస్ఐ సుబ్బరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నాగన్న, ఏసుదాసు తనను తీవ్రంగా వేధించారని బాధితుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. మృతుడు చినబాబు స్వస్థలం నంద్యాల తోటలైను వీధి.

Tags:    

Similar News