పురుగుల మందు తాగి యువకుడు మృతి..తల్లి అక్రమ సంబంధమే కారణమని ఆరోపణ

పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ యువకుడు మృతి

Update: 2024-09-25 11:16 GMT

దిశ,మెట్ పల్లి : పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జగ్గాసాగర్ గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాస్ (19) ఈనెల 9న రాత్రి సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా మెట్పల్లి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు.

విషయం తెలుసుకున్న ప్రభాస్ తండ్రి గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చి తన కుమారుని ఎలాగైనా బతికించుకోవాలని మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి చివరకు 24 మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే కొడుకు మృతికి తల్లే కారణమంటూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం కుమారునికి తెలియడంతోనే మనస్థాపం చెందిన యువకుడు ప్రభాస్ మృతి చెందినట్లు గ్రామస్తులు మృతుని తల్లిని నిలదీశారు.

ఈ క్రమంలో జగ్గాసాగర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర రావు తన బృందంతో జగ్గాసాగర్ గ్రామానికి చేరుకొని యువకుడి అంత్యక్రియలు జరిపించారు. అయితే యువకుడి చావుకు ఎవరు కారకులు కాదంటూ యువకుడు నిజామాబాదులో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న క్రమంలో నిజామాబాద్ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం తీసుకున్నామని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.


Similar News