భర్తను హత్య చేసి...ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య

కట్టుకున్న భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య ఉదంతం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-25 11:42 GMT

దిశ, నాగర్ కర్నూల్ : కట్టుకున్న భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య ఉదంతం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, భర్త బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో సాయి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నెల క్రితం అతనికి గుడిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. కాగా పెళ్లి అయినప్పటి నుంచి ఆమె భర్తను తరుచూ అవమానపరుస్తూ ఉండేది. రెండు రోజుల ముందు ఫోన్​లో ఇద్దరు వ్యక్తులతో చాటింగ్ చేస్తూ భర్త సాయికి దొరికిపోయింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ప్లాన్ ప్రకారం సాయిని హత్య చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది.

    స్థానికులు ఇంట్లో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా ఫ్యాన్ రెక్కకు టవల్ కట్టి ఉండడంతో కాలనీవాసులకు అనుమానం వచ్చింది. ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా హత్య అని బుధవారం పోలీస్ స్టేషన్లో మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని నాగర్ కర్నూల్ సెకండ్ ఎస్ఐ రమాదేవి పరిశీలించారు. కాగా మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఫోన్​లో చాటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నాగర్​కర్నూల్ ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

Tags:    

Similar News