అదృశ్యం అయిన వ్యక్తి శవమై లభ్యం

మూడు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై లభ్యమైన సంఘటన మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-10-15 15:50 GMT

దిశ,మద్దూరు: మూడు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై లభ్యమైన సంఘటన మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన భైరగోని యాదగిరి ఈ నెల 13 న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, మంగళవారం కూటిగల్ గ్రామ శివారులోని తూటల మర్రి సమీపంలో అనుమానస్పదంగా శవం అయి లభ్యమయ్యాడు. ఆదివారం నుంచి తన భర్త యాదగిరి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య లక్ష్మి ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గుర్తించిన గొర్ల కాపారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో పోలీసులు,క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి, విచారణ చేపట్టారు.అనంతరం శవాన్ని పోస్టుమార్టం కోసం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News