తాగిన మైకంలో భర్తతో గొడవపడి వివాహిత ఆత్మహత్య..

మండలంలో తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-07 11:52 GMT

దిశ, లక్షెట్టిపేట: మండలంలో తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చల్లంపేట గ్రామానికి చెందిన మృతురాలు జైనేని భీమక్క(35)కు అదే గ్రామానికి చెందిన జైనేని రవి తో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కూలి పనులు చేసుకుని బతికే ఆ దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై ఇద్దరు మద్యం తాగి తరచూ గొడవ పడుతుండేవారు. ఆదివారం సాయంత్రం అతిగా మద్యం తాగి భర్త పై చేయి చేసుకుని గొడవకు దిగి కొట్టింది. ఈ క్రమంలో ఇంటి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని మృతి చెందిందని స్థానిక ఎస్సై పి. సతీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Similar News