ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

Update: 2024-10-07 13:27 GMT

దిశ, వెబ్‌డెస్క్/జహీరాబాద్: జహీరాబాద్- బీదర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. న్యాల్కల్ మండలం గణేష్ పూర్‌కు చెందిన జగన్నాథ్ (42), ఆయన భార్య రేణుక (38), కుమారుడు వినోద్ (14), మామ గూనెల్లి సిద్రాం(60)లు సోమవారం పొలం పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని బైక్‌పై గణేష్ పూర్‌లోని ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో జహీరాబాద్ నుంచి కర్ణాటక ఆర్టీసీ బస్సు బీదర్ వైపు వస్తుంది. హుసెల్లి బస్ స్టాప్ వరకు రాగానే బైక్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News