30 అడుగుల దూరం ఎగిరిపడ్డ వ్యక్తి.. ఆ తర్వాత జరిగింది ఇదే..

రోడ్డు దాటుతున్న బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-10-15 15:55 GMT

దిశ కొండపాక: రోడ్డు దాటుతున్న బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దుద్దెడ గ్రామానికి చెందిన దయ్యాల మల్లేశం(40) సోమవారం రాత్రి గ్రామంలోని రాజీవ్ రహదారిపై బైకు పై వెళ్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు బైకును అతివేగంతో ఢీ కొట్టాడు. దీంతో మల్లేశం సుమారు 30 అడుగుల దూరంలో ఎగిరి పడ్డాడు. తలకు బలమైన గాయాలు కాగా 108 సహాయంతో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి వంటిమామిడి ఆర్విఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ విద్యాసాగర్ తెలిపారు.


Similar News