Ys Jagan: పులివెందులలో పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం వైయస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు..

Update: 2024-07-05 16:42 GMT

దిశ, అమరావతి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం వైయస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళతారు, మూడు రోజుల పాటు ఆయన పులివెందులలోనే ఉంటారు. జులై 8న వైయస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.


Similar News