లడ్డూ నెయ్యిపై సీఎం వ్యాఖ్యలను సవాల్ చేస్తూ హైకోర్టుకు వైసీపీ

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి వివాదంపై వైసీపీ కోర్టు మెట్టు ఎక్కింది.

Update: 2024-09-20 06:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి వివాదంపై వైసీపీ కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో లంచ్​మోషన్​ పిటిషన్​ను దాఖలు చేసింది. ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని చంద్రబాబు చేసిన ఆరోపణలపై సిటింగ్​ జడ్జి, లేదా హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొంది. పిటిషన్​ను స్వీకరించిన హైకోర్టు విచారణను బుధువారానికి వాయిదా వేసింది. 


Similar News