Ycp Vs Bjp: ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Update: 2024-09-23 13:22 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తల(Ycp Leaders)ను పరామర్శిచేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి(Former Mla Kethi Reddy) వెళ్లారు. అయితే ఆ సమయంలో జైలు వద్దకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. దీంతో బీజేపీ (Bjp), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కేతిరెడ్డి వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ముందుకు కదలకుండా కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో కారుపైకి ఎక్కేందుకు బీజేపీ కార్యకర్త ప్రయత్నం చేశారు. అయితే కారును వేగంగా ముందుకు నడిపారు. దీంతో కారుపై నుంచి బీజేపీ కార్యకర్త కింద పడ్డారు. ఈ ఘటనలో కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సర్దుమనిగింది. 


Similar News