సంక్రాంతికి ఊరెళ్లే వారికి సూపర్ గుడ్ న్యూస్.. రైల్వేశాఖ కీలక ప్రకటన

సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు పట్టణప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా సొంతూళ్లకు క్యూ కడుతుంటారు.

Update: 2024-09-19 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు పట్టణాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా సొంతూళ్లకు క్యూ కడుతుంటారు. లక్షల మంది ఊళ్లకు బయల్దేరడంతో రైళ్లు (Trains), బస్సులు (Busses) కిక్కిరిసిపోతాయి. టికెట్ దొరకడమే కష్టమైపోయింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే కనిపించాయి. వచ్చే ఏడాది జనవరి 11, 12, 13 తేదీల్లో నగరాల నుంచి రైళ్లలో ఏపీకి వెళ్లాలంటే టికెట్లు లేవు. సంక్రాంతి పండుగకు 4 నెలల ముందే రెగ్యులర్​రైళ్లన్నీ ఫుల్​అయ్యాయి. రిజర్వేషన్ ​ఓపెన్ ​చేసిన నిమిషాల్లో టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. ప్రస్తుతం వెయిటింగ్​ లిస్ట్​ కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో ఊళ్ల నుంచి వచ్చి హైదరాబాద్ (Hyderabad)లో ఉంటున్న వారు పండుగకు ఇంటికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు.

ముఖ్యంగా సికింద్రాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు జనవరి 10, 11, 12 తేదీల్లో ఫుల్ అయిపోయాయి. కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్ ​రైళ్లలో కూడా సీట్లు ఖాళీ లేవు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనన చెందుతున్నారు.

ఇలాంటి టైంలో వీరందరికీ రైల్వేశాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రైల్వేశాఖ (Railwa Department).. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు 4 నెలల ముందుగానే కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో 2025 సంక్రాంతి కోసం 400 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించింది. ముందుగా వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించేందుకు రెగ్యులర్ ​రైళ్లకు అదనపు కోచ్​లు ఏర్పాటు చేస్తామని, అవి కూడా సరిపోకపోతే.. 400 స్పెషల్ ట్రైన్‌ (400 Special Trains)లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.


Similar News