చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించిన మధ్యప్రదేశ్ సీఎం

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్(Mohan Yadav) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి(Chandrababu Nayudu)పై ప్రశంసల జల్లు కురిపించారు.

Update: 2024-10-03 08:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్(Mohan Yadav) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి(Chandrababu Nayudu)పై ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఆయన సమావేశమయ్యారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అభివృద్ది అంశాల గురించి వారిరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ యాదవ్.. ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో వచ్చిన కొద్దిన నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్న చంద్రబాబు పాలన అద్భుతం అన్నారు. ఆయన విజన్ ఉన్న నాయకుడని, ప్రస్తుతం దేశానికి ఇలాంటి నాయకుల అవసరమే ఎక్కువ ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం మాత్రమే కాదని.. సీఈవో అని కితాబిచ్చారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని విమానాశ్రయాలు కేటాయించాలని మోహన్ యాదవ్ కేంద్ర మంత్రిని కోరారు.


Similar News