Nara Bhuvaneshwari: ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలు మనసును కలచివేశాయి: నారా భువనేశ్వరి

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-09-02 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో వేగవంతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాగం పనిచేయాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఏపీ ప్రజలకు అదైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. వర్షాల కారణంగా ఏపీ రాష్ట్రం ఇలా ఇబ్బందులకు గురికావడం బాధాకరమని తెలిపారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగిందన్న వార్తలు మనసును కలచివేసిందని ఎమెషనల్ అయ్యారు. చంద్రబాబు వరద నీరు తగ్గే వరకు పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయమందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారని, అధికారులు అనుక్షణం అప్రమత్తతతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, కాగా ఎవరూ కూడా అధైర్యపడకండి అంటూ నారా భువనేశ్వరి చెప్పుకొచ్చింది. 


Similar News