జనసేన పార్టీని రేప్ చేస్తున్న నాదెండ్ల మనోహర్ : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జనసేన పార్టీని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు అంటే మానభంగం చేస్తున్నాడు అని వైసీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-10-16 11:06 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు అంటే మానభంగం చేస్తున్నాడు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జనసేన పార్టీని మానభంగం చేస్తున్న విషయాన్ని పార్టీలో ఎవరు కూడా పవన్ కల్యాణ్‌కు చెప్పకూడదంట అని మండిపడ్డారు.ఇప్పటివరకు జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు. ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ రేప్ చేస్తుంది. మా నెల్లూరు సిటీలో ఇప్పటికే నారాయణ జనసేన పార్టీని రేప్ చేయడం మొదలు పెట్టాడు. పార్టీ బలంగా ఉంటుందని చెప్పుకునే గోదావరి జిల్లాల్లో పలువురు నాయకులు పార్టీని టీడీపీ ఎలా రేప్ చేస్తుందో నాతో చెప్తూ ఆవేదన చెందుతున్నారు అంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీలో అవమానాలు భరించలేకే తాను పార్టీ మారానని వైసీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. జనసేన పార్టీని తాను ఎందుకు వీడాల్సి వచ్చిందో రాజీనామా లేఖలో స్పష్టంగా తెలియజేసినట్లు వెల్లడించారు. అయినప్పటికీ నాదెండ్ల మనోహర్ ముసుగులో పనిచేసే శతాఘ్ని అనే చిల్లర బ్యాచ్ సోషల్ మీడియా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వేధించడం బాధకలిగిస్తోందని అన్నారు. పార్టీలో కష్టపడిన వారిని గుర్తించకుండా, చిల్లర పంపించే వారి పోస్టులను పార్టీ అధికారిక పేజీలు, ట్విట్టర్‌లో పెట్టడమే ఈ శతాఘ్ని బ్యాచ్ ప్రధాన పని అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. తనను కోవర్టు అంటూ దూషించడంపై కేతంరెడ్డి వినోద్ రెడ్డి మండిపడ్డారు.

నాదెండ్ల పెద్ద కోవర్టు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలంటూ తన మాదిరిగా ఎవరైనా తిరిగారా చెప్పాలని వైసీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిలదీశారు. తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ స్టిక్కర్లు అంటించాను..కరపత్రాలు పంచాననని గుర్తు చేశారు. ఊరంతా సీఎం పవన్ కల్యాణ్ అంటూ పోస్టర్లు.. పెయింటింగ్‌లు సైతం వేసినట్లు వెల్లడించారు. ఆఖరికి సీఎం పవన్ కల్యాణ్ అంటూ శిలాఫలకం కూడా వేశాను అని గుర్తు చేశారు. ఒక కోవర్టు చేసే పని ఇలా ఉంటుందా చెప్పండి అని నిలదీశారు. కోవర్టు అంటే ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ కోసం పనిచేసే వారు. అంటే నాలుగేళ్ళుగా నాలాంటి వారిని నమ్మిస్తూ టీడీపీ కోసం పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ పెద్ద కోవర్టు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. తాను వైసీపీకి అమ్ముడుపోయానంటూ విమర్శిస్తున్న వారు ఇన్ని రోజులుగా ఎంతకి అమ్ముడుపోయి జనసేన పార్టీలో పనిచేసానో చెప్పాలని నిలదీశారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డిని డబ్బుతో ఎవరూ కొనలేరని చెప్పుకొచ్చారు. తనకు గౌరవం, తనను నమ్మి తనతో ప్రయాణించే వారికి అండగా ఉండగలననే వైసీపీలో చేరాను అని స్పష్టం చేశారు. నారాయణ దగ్గర లేని డబ్బా చెప్పండి... తాను పార్టీ మారుతున్నాననే విషయం తెలిసిన నాటి నుండి మూడు సార్లు తన వద్దకు డబ్బు ఇస్తామంటూ మధ్యవర్తులను పంపాడంటూ సంచలన వ్యాక్యలు చేశారు.తాను రెడ్డిని కాబట్టి వైసీపీలో చేరాను అంటూ పోస్టులు పెడుతున్నారు. పార్టీలో పనిచేసినన్ని రోజులు తన కులం గుర్తు రాలేదా అని నిలదీశారు. జనసేన పార్టీ కాపులదా అని ప్రశ్నిస్తున్నాను. మరైతే ఇక్కడ పెత్తనం అంతా నాదెండ్ల మనోహర్ అనే కమ్మ వ్యక్తిదే కదా. వైసీపీలో ఉండే కాపు నాయకులను మీరు పాలేర్లు అంటూ పిలుస్తారు. టీడీపీలో ఉండే కాపులు పాలేర్లు కాదా. నారాయణ అనే పాలేరు పంచన చేరారంటే మిమ్మల్ని ఏమని పిలవాలి అంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కాపులందరూ వైసీపీలో ఎందుకు ఉన్నారంటే, ఇక్కడ ఉంటే తాము మంచి నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అవ్వగలమని, జనసేన పార్టీలో ఆ భరోసా లేదనే భావనతోనేని అభిప్రాయపడ్డారు. పాతికేళ్ళు అంటూ మభ్య పెడుతూ యువత భవితను ఇక్కడ పాతి పెడుతున్నారు అని మండిపడ్డారు. తనను విమర్శించే వారికి ఒక్కటే చెప్తున్నా. తాను 316 రోజులు ఏ నిబద్ధతతో అయితే పనిచేసానో అలాంటి నిబద్ధతతో ఆపకుండా కనీసం నెల రోజుల పాటు మీ నియోజకవర్గాల్లో పనిచేసి మాట్లాడండి. మీ విమర్శలను స్వాగతిస్తాను అని చాలెంజ్ చేశారు. అంతే కానీ ఇంటర్నెట్ ఫ్రీ గా వస్తుంది కదా అని బాత్ రూమ్ లలో తలుపులు వేసుకుని సోషల్ మీడియాలో సొల్లు వాగుడు వాగితే చూస్తూ ఊరుకోను అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News