దీపావళి టపాసులు తయారు చేస్తుండగా భారీ పేలుడు

దీపావళి టపాసులు(Diwali Tapas) తయారు చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు(Huge explosion) సంభవించి ఒకరు మృతి చెందారు.

Update: 2024-10-28 12:29 GMT

దిశ, వెబ్ డెస్క్: దీపావళి టపాసులు(Diwali Tapas) తయారు చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు(Huge explosion) సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘోరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో చోటు చేసుకుంది. రాబోయే దీపావళి( Diwali) కోసం ఓ ఇంట్లో అనధికారికంగా టపాసులు తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు పదార్థాలకు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వెంకటకృష్ణ (30) అనే వ్యక్తి మృతి చెందగా.. అక్కడే ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News