ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బాలినేని కి చుక్కెదురు

ఆంద్రప్రదేశ్ హై కోర్టు(High Court)లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy')కి చుక్కెదురైంది.

Update: 2024-10-28 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ హై కోర్టు(High Court)లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy')కి చుక్కెదురైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆయన హైకోర్టులో పిల్ వేశారు. కాగా ఈ రోజు విచారణకు వచ్చిన బాలినేని పిల్ లో ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు. అయితే వైసీపీ(YCP)పార్టీకి రాజీనామా చేశారు. జగన్‌(Jagan) విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ముఖ్య అనుచరులతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.


Similar News