Minister Narayana: బుడమేరు ఆక్రమణలే విజయవాడను ముంచాయి : మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

బుడమేరు (Budameru) ఆక్రమణలే విజయవాడ (Vijayawada)ను ముంచేశాయని మంత్రి నారాయణ (Minister Narayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-05 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుడమేరు (Budameru) ఆక్రమణలే విజయవాడ (Vijayawada)ను ముంచేశాయని మంత్రి నారాయణ (Minister Narayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన నెల్లూరు (Nellore)లో మాట్లాడుతూ.. బుడమేరు వరదల వల్ల లక్షల మంది ఇబ్బందులు పడ్డారని అన్నారు. అలాంటి కష్టం ఎవరికీ రాకూడదని పేర్కొన్నారు. 2015 ప్రాంతంలో వరదలతో నెల్లూరు (Nellore) నగరం మునిగిన ఆయన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాల మేరకు నెల్లూరు (Nellore) నగరాభివృద్ధికి పకగడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆ విషయంపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా త్వరలోనే కాలువల వెడెల్పు పనులు చేపడుతామని మంత్రి నారాయణ తెలిపారు.   


Similar News