విశాఖలో భూ అక్రమాలు... మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వంలో విశాఖలో భారీగా భూ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో సీరియస్ యాక్షన్‌కు రెడీ అవుతోంది. ...

Update: 2024-08-14 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్: జగన్ ప్రభుత్వంలో విశాఖలో భారీగా భూ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో సీరియస్ యాక్షన్‌కు రెడీ అవుతోంది. రాష్ట్రం మొత్తంలో విశాఖలోనే ఎక్కువగా భూ అవకతవకలు జరిగాయని, 22ను దుర్వినియోగం చేసినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయి. దీంతో భూ అక్రమాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ సంస్కరణ పేరుతో నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. భూ లావీదేవీల్లో డబ్బుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. 22ఏ ను అడ్డుపెట్టుకుని కొందరు ఆస్తులను ధ్వంసం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News