‘దిశ’ కథనానికి స్పందన.. ఆ సచివాలయానికి తాళం
‘కంబదూరులో లాడ్జి గా మారిన సచివాలయం’ అనే కథనం ‘దిశ’ తెలుగు దినపత్రికలో గురువారం ప్రచురితమైన విషయం విదితమే.
దిశ, కళ్యాణదుర్గం: ‘కంబదూరులో లాడ్జి గా మారిన సచివాలయం’ అనే కథనం ‘దిశ’ తెలుగు దినపత్రికలో గురువారం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనానికి మండల పరిషత్ అధికారులు స్పందించారు. సచివాలయాన్ని శుభ్రం చేసి, తలుపులకు మరమ్మతు చేసి తాళాలు వేశారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులకు సమాచారం అందిస్తామని ఇన్ ఛార్జ్ ఎంపీడీవో జయచంద్ర తెలిపారు.