‘ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ బాబు’.. ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై వైసీపీ నేత, ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-06 12:02 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై వైసీపీ నేత, ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తుంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మనోగతం అంటూ ట్విట్టర్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు.

రంజాన్ మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. దసరా పండుగ అయిపోవస్తుంది. ఇప్పుడు అర్జెంట్‌గా బైబిల్ కావాలి ఎక్కడ ఎక్కడ దొరుకుంతుంది ఫ్రెండ్స్.. క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది వేషం మార్చాలి అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వివాదం పై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.


Similar News