Nikhil Siddhartha : ఏకంగా ప్రధానిని ట్యాగ్ చేస్తూ టాలీవుడ్ హీరో ట్వీట్.. వారిని కఠినంగా శిక్షించాలంటూ
తిరుమల లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్ధారణ అయింది. దీంతో తిరుమల పవిత్రను దెబ్బతీశారంటూ భక్తులు, సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఈ అక్రమానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil) కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో మన దేశ ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టాడు.
“గత కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి ప్రసాదంలో టాంపరింగ్ జరిగిందని తెలిసి షాక్ అయ్యా. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి.” అని ప్రధాని మోదీ(PM Modi), సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), లోకేశ్(Lokesh), అమిత్షా(Amith Shah)లను నిఖిల్ ట్యాగ్ చేశారు.