శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు

శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణ రథోత్సవం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Update: 2024-10-23 07:13 GMT

దిశ, శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణ రథోత్సవం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుంచి ఆలయం మాడవీధులు హరిహర రాయ గోపురం బ్రహ్మానందరాయ గోపురం శివాజీ గోపురం మీదుగా మాడవీధుల్లో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణ రథోత్సవం జరిగింది.

స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో జరుగుతుండడంతో వందలాదిగా స్థానికులు భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవం తిలకించారు స్వర్ణ రథం పై ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు స్వర్ణ రథోత్సవంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి దేవస్థానం అధికారులు స్థానిక పోలీసులు పాల్గొన్నారు ముందుగా వేకువజామునే శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అనంతరం మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు.


Similar News