ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ముగిసింది.

Update: 2024-10-23 09:02 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కేబినెట్ లో చర్చించిన కీలక అంశాలను వివరించనున్నారు. 

ఏపీ కేబినెట్ సమావేశంలో ఉచిత ఇసుక, రేషన్, అమరావతి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinders) పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రేషన్ డీలర్ల నియామకం, కొత్తరేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, పోలవరం పనులు, దేవాలయాల పాలకమండళ్ల సంఖ్య పెంపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వివరాలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వివరించనున్నారు. 

Tags:    

Similar News