పవన్ కల్యాణ్ బూట్లు తూడవటానికి సిద్ధం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ప్రకటన

తిరుపతి లడ్డూ(Tirupati laddu) అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-24 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లడ్డూ(Tirupati laddu) అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపించాలని సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు సవాల్ చేశారు. లడ్డూ అంశంలో తాము తప్పు చేశామని తేలితే పవన్ కల్యాణ్ బూట్లు తూడవటానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఆంజనేయస్వామి(Anjaneyaswami)పై ప్రమాణం చేసి లడ్డూ అపవిత్రం అయిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు.

తండ్రి చనిపోతే కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంతే వింతగా ఉందని అన్నారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా నీచ రాజకీయాలు చేయొద్దని సూచించారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురందేశ్వరి, లోకేష్, పవన్‌ కల్యాణ్‌లు దారుణ ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇదంతా టీడీపీ, జనసేన, బీజేపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఇలా చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.


Similar News