విశాఖలో కుప్పకూలిన కొండ.. వీడియా చూశారా..?
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలోని దువ్వపాలెం క్వారీలో కొండచరియలు - Collapsed hill in Visakhapatnam.. Scenes go viral on social media
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలోని దువ్వపాలెం క్వారీలో కొండచరియలు ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందకు జారిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో జనం లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఒక కొండ దానంతట తానుగా కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెందుర్తి సమీపం లోని దువ్వపాలెం క్వారీలో ఈ కొండ చరియలు విరిగి పడ్డాయి. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు ఎందుకు విరిగిపడ్డాయన్నదిపై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే అది మట్టి కొండ కావడంతో ఇలా కూలిందని స్థానికులు అంటున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార పార్టీకి చెందిన మైనింగ్ మాఫియా కొండలను తవ్వేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్పందించారు.