ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్... చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత దంపతులు

ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Update: 2024-09-17 12:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu)ను దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత దంపతులు కలిశారు. వివేకానంద పీఏ కృష్ణారెడ్డి అన్యాయంగా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. సీఐడీ విచారణ జరిపి వాస్తవాలను బయటకు తేవాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన విషయాలు అన్నీ తనకు తెలుసని... ఆయా విషయాలపై పూర్తి విచారణ జరిపించి, తప్పకుండా న్యాయం చేకూరుస్తానని చంద్రబాబు సునీత దంపతులకు హామీ ఇచ్చారు.


Similar News