Anna Canteens: ఏపీ ప్రజలకు శుభవార్త..రెండో విడుత అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Dy.CM Pavan Klayan) సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ(TDP-JSP-BJP) సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆగష్టు 15న అన్నా క్యాంటీన్ల(Anna Canteens)ను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-17 22:10 GMT

దిశ, వెబ్‌డెస్క్:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Dy.CM Pavan Klayan) సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ(TDP-JSP-BJP) సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆగష్టు 15న అన్నా క్యాంటీన్ల(Anna Canteens)ను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే.మొత్తంగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలిదశలో భాగంగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం ఇదివరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం తాజాగా రెండో విడుతకు రంగం సిద్ధం చేసుకుంది.రేపు మరో 75 క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ఓపెన్ చేయనున్నారు.ఈ క్యాంటీన్లలో 15 రూపాయలకే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుంది.ఉదయం టిఫిన్,మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో 2018లో చంద్రబాబు ప్రభుత్వం అన్నాక్యాంటీన్ల పేరుతో ఏర్పాటు చేసింది.కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను మూసేసిన విషయం తెలిసిందే.


Similar News