Tirupati Janasena: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని గద్దె దించుతాం

2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం నుంచి గద్దె దించుతామని తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్ రాయల్ హెచ్చరించారు....

Update: 2023-03-24 13:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:Tirupati Janasena In Charge Kiran Royal warned YSR Congress ousted Power in Elections. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనపై విరక్తి చెందిన ప్రజలు ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు వెల్లడించారని గుర్తు చేశారు. అంతేకాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం మార్పుకోరుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే ఓటు వేయించుకోలేని జగన్ 2024లో వై నాట్ 175 అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలే పార్టీకి ఓట్లు వేయలేనప్పుడు ప్రజలు ఎలా ఓట్లేస్తారని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

Good News: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నిధులు 

Tags:    

Similar News