AP: పునరావస కేంద్రానికి వెళ్తున్న బోటు గల్లంతు..

రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

Update: 2024-09-02 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, తోట్లవల్లూరు మండలంలో వరదల్లో చిక్కుకున్న 8 మందిని బోటులో అన్నవరపులంక నుంచి పునరావాస శిబిరానికి తరలిస్తుండగా బోటు గల్లంతైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 8 మంది ఉన్నారు. అందులో ఆరుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.  


Similar News