Minister Sandhya Rani: నువ్వు మనిషివా జగన్‌?.. మంత్రి సంధ్యారాణి ఫైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌‌పై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఫైర్ అయ్యారు..

Update: 2024-10-26 16:28 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)పై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummadi Sandhya Rani) ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ఆస్తుల వ్యవహారంలో చెల్లి షర్మిల(Sharmila) పట్ల జగన్ అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. ఆస్తి కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని కోర్టులో పెట్టిన నువ్వు మనిషివా జగన్? అంటూ ఫైర్ అయ్యారు. ‘‘మీ తండ్రి పోటీ చేసినప్పుడు నీకు సొంత ఇల్లు కూడా లేదు. అలాంటిది ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావు. రాళ్లు కొట్టి సంపాదించావా?. వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించావు కదా. ఇంతవరకు చెక్కులు పంపిణీ చేయలేదెందుకు?.’’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. 


Similar News