లడ్డూ వివాదం.. నటుడు ప్రకాశ్‌కు పవన్ కల్యాణ్ చురకలు

తిరుమల లడ్డూ వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పు బట్టారు....

Update: 2024-09-24 04:39 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Issue)పై నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj) వ్యాఖ్యలను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Ap Deputy Cm Pawan Kalyan) తప్పు బట్టారు. శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్పా అని ప్రశించారు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. సెక్యూలరిజం అంటే రెండు మార్గాలని, ప్రకాశ్ రాజు తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని, సరదాగా మాట్లాడే ముందే 100 సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై వ్యంగ్యంగా మాట్లాడితే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాడాల్సిన బాధ్యత గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత అని పవన్ కల్యాణ్ తెలిపారు.


Similar News