AP Elections 2024: పసికందుతో పోలింగ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.. ఫోటో వైరల్

ఓటు అనేది ప్రతి ఒక్క పౌరుడి హక్కు. ఆ హక్కును వినియోగించుకోవడం ప్రతిఒక్కరి భాధ్యత.

Update: 2024-05-13 04:24 GMT

దిశ వెబ్ డెస్క్: ఓటు అనేది ప్రతి ఒక్క పౌరుడి హక్కు. ఆ హక్కును వినియోగించుకోవడం ప్రతిఒక్కరి భాధ్యత. అయితే చాలామంది అన్నీ సక్రమంగా ఉన్నా ఓటు వేసేందుకు బద్దకిస్తారు. అయితే కొంతమంది మాత్రం ప్రజాస్వామ్య రక్షణ కోసం నడవలేని స్థితిలోనూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. కడప నియోజకవర్గంలోని 173 పోలింగ్ కేంద్రానికి నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లు వీల్‌చైర్‌లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలానే ఓ మహిళ చేతుల్లో పసిబిడ్డను పట్టుకుని ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో వేచిఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆ ఓటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  


Similar News