AP Elections 2024: తన ఓటు తనకు వేసుకోలేని మిధున్ రెడ్డి.. కారణం ఇదే..!

తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న మిధున్ రెడ్డికి ఏర్పడింది.

Update: 2024-05-13 03:47 GMT

దిశ ప్రతినిధి, చిత్తూరు: తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న మిధున్ రెడ్డికి ఏర్పడింది. సోమవారం ఉదయం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పుంగునూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే ఈయన రాజంపేట ఎంపీగా పోటీ చేసినందున తన ఓటు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉండటంతోతన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి ఎదురయ్యింది. అదే నియోజకవర్గంలో తన తండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున తన తండ్రికి ఒక ఓటు, అలానే చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రెడ్డప్పకు మరో ఓటు వేసినట్లు ఆయన వెల్లడించారు.


Similar News